ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 వరల్డ్ కప్ కి జట్టును ప్రకటించిన శ్రీలంక...

sports |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 12:00 PM

జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన పటిష్ఠమైన జట్టును మెగా టోర్నీకి ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్‌లో శ్రీలంక టీ20 కెప్టెన్‌గా ఎంపికైన హసరంగా పొట్టి ప్రపంచ కప్ సంగ్రామంలో జట్టును నడిపించనున్నాడు. అతనికి వైస్ కెప్టెన్ గా చరిత్ అసలంక ఎంపికయ్యాడు.శ్రీలంక ప్రపంచ కప్ జట్టులో సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్‌కు మరోసరి చోటు దక్కింది. మాథ్యూస్ టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించు కోవడం ఇది ఆరోసారి. జట్టు నిండా ఆల్‌రౌండర్లతో శ్రీలంక జాట్ట్గటు బలంగానే కనిపిస్తుంది. 


టీ20 వరల్డ్ కప్ శ్రీలంక జట్టు ఇదే వనిందు హసరంగ (సి), చరిత్ అసలంక (విసి), కుసాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డి సిల్వ, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, దుష్మంత చమీర, మతీషా పతిరణ, నువాన్ తుషార, దిల్షన్ మదుశంక."మరియూ ట్రావెలింగ్ రిజర్వ్‌ ప్లేయర్లుగా అసిత ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, భానుక రాజపక్సే, జనిత్ లియానాగే. చోటు దక్కించు కున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com