పెనుకొండ పట్టణంలోని గాంధీ సర్కిల్ లో శుక్రవారం జన విజ్ఞాన వేదిక పెనుకొండ జోన్ కమిటీ ఆధ్వర్యంలో పీపుల్స్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా కార్యదర్శి హరి, జోన్ కమిటీ అధ్యక్షులు నబీ, జోన్ ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ బాషా, ఘనగిరి స్కూల్ కరస్పాండెంట్ ఇలియాజ్, లెక్చరర్ రామన్న, కోగిర జయచంద్ర రెడ్డి, యూటీఎఫ్ రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.