రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి చెందిన పావని(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పావనికి అక్క, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. పావని తల్లి శకుంతల చికెన్ వ్యాపారం చేస్తారు. పావని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.