సత్యసాయి జిల్లాలో ఈనెల 12 వతారీఖున (దసరా రోజు) అత్తాకోడళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారని.. సంఘటన జరిగిన 48 గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకొని రిమాండు విధించారని హోంమంత్రి అనిత తెలిపారు. మహిళల భద్రత విషంయంలో ఈ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఆడపిల్లపై నేరం చేయాలనే ఆలోచన వస్తేనే భయం వేసే పరిస్ధితి తేవాలని సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించారన్నారు. సీసీ కెమెరాలు బద్దలు కొట్టినా వారిని రెండు వందల కిలోమీటర్లు చేజ్ చేసి కొండలు గుట్టల్లో కూడా వెతికి 48 గంటల్లో పట్టుకున్నారని చెప్పారు. వారంతా నేరచరిత్ర కలిగిన వ్యక్తులని.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని.. వారిలో ఉన్నవారిపైనా చాలా కేసులు ఉన్నాయన్నారు. తప్పనిసరిగా శిక్షపడుతుందనే ఆలోచన వస్తేనే ఇలాంటి కేసులు తగ్గుతాయని హోంమంత్రి అనిత అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసులు వస్తే వాటిని స్పెషల్ కోర్టులకు పంపుతామన్నారు. గత ప్రభుత్వంలో ఒక రిక్రూట్మెంట్ ఒక్కటి కూడా జరగలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ చేస్తున్నామన్నారు. దసరా సమయంలో, ఆ తరువాత భనానీల రాక విషయంలోనూ పోలీసులు గొప్పగా పనిచేశారని హోంమంత్రి అనిత కొనియాడారు.