ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీపికబురు.. గుంటూరుకు మహర్దశ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 09:39 PM

ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం శుభవార్త చెప్పింది.. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 200.06 కి.మీ. పొడవైన 13 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి సీఆర్‌ఐఎఫ్‌ (కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి) నుంచి రూ.400 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ స్వయంగా వెల్లడించారు. అలాగే గుంటూరు-నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98 కోట్లతో గుంటూరు శంకర్‌ విలాస్‌ ఆర్వోబీని నాలుగు వరుసలతో నిర్మించడానికి ఆమోదం తెలిపినట్లు కూడా ట్వీట్‌లో ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతవారం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిశారు. అయితే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు.. అయితే వారానికే రోడ్లకు సంబంధించిన నిధులపై కేంద్రమంత్రి నుంచి ఈ ప్రకటన వచ్చింది.


మరోవైపు తెలంగాణకు కూడా కేంద్రం తీపికబురు చెప్పింది. నేషనల్ హైవే 565 నల్గొండ మీదుగా.. నకిరేకల్-నాగార్జున సాగర్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే దిశగా అడులు వేస్తున్నారు. ఈ మేరకు రూ.516 కోట్లతో 14 కి.మీ. మేర 4 వరుసల బైపాస్‌ రోడ్డు నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. ఈ బైపాస్ రోడ్డుకు నిధుల కూడా మంజూరు చేసినట్లు ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. ఈ నేషనల్ హైవే 565 ఏపీ-తెలంగాణల అనుసంధానానికి ముఖ్యమైనదన్నారు గడ్కరీ.


తెలంగాణలోని నకిరేకల్ కూడలి నుంచి ఈ హైవే నల్గొండ, ఏపీలోని మాచర్ల, యర్రగొండపాలెం, కనిగిరి మీదుగా వెళుతుంది. అయితే నల్గొండ సమీపంలో వాహనాల రద్దీ పెరిగింది.. ఈ క్రమంలో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం నిధుల్ని మంజూరు చేశారు. ఈ బైపాస్ నిర్మాణంతో నల్గొండలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. అలాగే నకిరేకల్‌ - నాగార్జునసాగర్‌ మధ్య కనెక్టివీట పెరగనుంది. చాలా రోజులుగా ఈ బైపాస్ నిర్మాణం కోసం కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు.. మొత్తానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బైపాస్ మంజూరు చేసినందుకు కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com