తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు. ఈనెల 18న ఎమ్మెల్యీలు, ఎమ్మెల్సీలతో సమావేశం అవనున్న సీఎం.. పార్టీ బలోపేతం, సభ్యత్వం, ప్రభుత్వ విధానాలపై చర్చించనున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాలలో ఎమ్మెల్యేల జోక్యం చేసుకోవడంపై కూడా ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపరంగా ఎమ్మెల్యేలతో తొలిసారిగా చంద్రబాబు భేటీ అవుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ క్రమంలో సమావేశానికి సంబంధించి ఎజెండాను పార్టీ కేంద్ర కార్యాలయం తయారు చేస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో చేస్తున్న దందాలపై కూడా సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇవ్వనున్న ట్లు తెలుస్తోంది.