ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వన్ చిప్ ఛాలెంజ్‌...ప్రాణం మీదకు తెచ్చింది

international |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 11:33 PM

ఇటీవల తినడం విషయంలో ఛాలెంజ్ ప్రోగ్రాంలు ఎక్కువయ్యాయి. ఒక్కోసారి ఈ ఛాలేంజ్ లు ప్రాణాలు హరించే పరిస్థితికి వచ్చింది. ఇటీవల అమెరికాలో ఓ ఆన్‌లైన్ ఛాలెంజ్‌లో పాల్గొని ముగ్గురు విద్యార్థులు ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. అక్కడ సోషల్ మీడియాలో వన్ చిప్ ఛాలెంజ్‌ వేలంవెర్రిగా మారింది. ఇందులో ఘాటైన మిరియాలతో తయారు చేసిన చిప్స్‌ను తినాలి. కాలిఫోర్నియాలో లోది హై స్కూలుకు చెందిన విద్యార్థులు ఇది ట్రై చేశారు. అంత ఘాటైన మసాలతో తయారు చేసి చిప్స్‌ తినడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్కూలు యాజమాన్యం వారిని ఆస్పత్రికి తరలించారు. చిప్స్ తిన్న విద్యార్థులు మొదట వాంతులు చేసుకున్నారు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఈ ఛాలెంజ్‌ను ఆ చిప్ కంపెనీకి చెందిన బ్రాండ్ పాక్వీ క్రియేట్ చేశారు. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నవారు కారంగా ఉన్న చిప్‌ను తినాలి, తర్వాత నీళ్లు తాగకుండా గంటసేపు అలాగే ఉండాలి. దీనిని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే చాలా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ ఛాలెంజ్‌‌‌లో గెలుపు కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. దీనికి చాలా ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ క్రమంలో అక్కడ విద్యార్థులు కూడా ఈ చిప్స్‌ను తినడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు కూడా కాలేజ్ స్టేషన్‌లోని ఐఎల్‌ టెక్సాస్‌లోని ఐదుగురు విద్యార్థులు చిప్స్‌ను తినడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. అప్పుడు ఓ విద్యార్థి అపస్మారక స్థితికి వెళ్లాడు. దాంతో వైద్యులు ఈ ఛాలెంజ్‌‌లో పాల్గొనవద్దని పిల్లలకు చెప్పాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. వారికి అవగాహన కల్పించాలన్నారు. అయితే దీనిపై బ్రాండ్ పాక్వీ స్పందన వేరేలా ఉంది. చిప్స్‌ ప్యాకెట్‌పై అన్ని రకాల హెచ్చరికలు చేశామని, అలర్జీలున్నవారు తీసుకొవద్దని పేర్కొన్నామని చెప్పి సమర్థించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com