ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేతనాలు అమలు చేయాలంటూ ఆలయాల్లో క్షురకుల ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 15, 2018, 10:09 AM

అమరావతి : కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోని క్షురకులు ఆందోళన చేస్తున్నారు. విజయవాడ దుర్గ గుడిలో క్షురకులు విధులు బహిష్కరించారు. శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో కేశఖండన శాలలో క్షురకులు బైఠాయించి ధర్నా చేస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం కళ్యాణకట్టలో క్షురకులు విధులు బహిష్కించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో క్షురకులు ఆందోళన చేస్తున్నారు. భక్తులకు తల నీలాలు తీయకుండా నిరసన తెలపుతున్నారు. రెండు వారాల క్రితం దుర్గ గుడిలో క్షురకునిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య దాడి చేశారు. దాడి విషయంలో పెంచలయ్యపై చర్యలు తీసుకోకపోవడాన్ని క్షురకులు తప్పుపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com