విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ జరుగుతోంది. గత నెల 23న కశ్మీర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా తొలి షెడ్యూల్ ను పూర్తి చేశారు. అయితే షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని వార్తలు వచ్చాయి. విజయ్, సమంతకు గాయాలైనట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై ఖుషి సినిమా టీం స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. షూటింగ్ లో ఎలాంటి ప్రమాదం జరగలేదని, టీం అంతా క్షేమంగా హైదరాబాద్ కి తిరిగివచ్చినట్లు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. జయరాం, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, లక్ష్మీ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.