స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. వెంకటాచలం మండలం అక్షర పాఠశాలలో జరిగిన వివేకానంద జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని, వారసత్వ సంపదను సంరక్షించుకోవాలని, ప్రకృతిని పరిరక్షించుకోవాలని చెప్పారు.