చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని కొత్తపేట గంగమ్మ తోపులో భార్యా భర్తల మధ్య కలహంతో సాగర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పీ 108కి సమాచారం అందించారు. సగం వరకు కాలిన సాగర్ పరిస్థితి విషమంగా ఉంది. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.