పర్చూరు బరిలో ఉన్న ఏలూరి సాంబశివరావు విపక్ష నేతగా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి 75 రోజుల పాదయాత్ర చేశారు. అప్పట్లో పోటీగా వైకాపా వాళ్లు పాదయాత్ర ప్రారంభించి వెంటనే ఆవేశారు. ప్రభుత్వం తరచూ గ్రానైట్ వ్యాపారులపై దాడులు చేస్తోంది. అది ప్రశ్నించినందుకు ఎమ్మెల్యేపై కేసులు పెట్టారు. అయినా వ్యాపారులకు ఆయన అండగా నిలిచి దాడులు లేకుండా గట్టిగా యంత్రాంగాన్ని నిలదీయటంతో గ్రానైట్ రంగంపై ఉపాధి పొందుతున్న వారు ఆయన వైపు సానుకూలత చూపుతున్నారు. నియోజకవర్గంలో అడ్డదారులు తొక్కి వైకాపా విజయం సాదించాలని కుట్రపూరితంగా 20 వేల ఓట్లు తొలగించాలని పన్నాగం పన్నగా దానిపై ఆయన గట్టి పోరాటం చేసి ఏ ఒక్కరి ఓటు అన్యాయంగా తొలగించకుండా అడ్డుకున్నారు. ఇది కూడా తెదేపాతో పాటు సాధారణ ఓటర్లలో బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇవన్నీ ఆయన గెలుపులో క్రియాశీలకం కాబోతున్నాయి.