ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 08:01 PM

 సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేసిన మంచిని చూసి ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌బోతున్నార‌ని ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎండ‌గ‌ట్టారు. సింగడు అద్దంకి రానూ వచ్చాడు, పోనూ పోయాడు అన్నట్టు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి రానూ వచ్చారు, తిరిగి పోనూ పోయారని.. రాసుకోనొచ్చింది కూడా చదవలేక, చదివేసి వెళ్లిపోయారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజలకు ఏమి చెప్పకుండా మరచిపోయి మరీ వెళ్లిపోయారని విమర్శించారు. వీళ్ల తిరుపతి ట్రిప్పుకు, సింగడి అద్దంకి ట్రిప్పుకు పెద్ద తేడా లేదన్నారు. అభివృద్ధిని చూసి తిరుపతి ప్రజలు ఓట్లు వేయబోతున్నారని.. జగనన్న చేసిన మంచిని చూసి ఓట్లు వేయబోతున్నారన్నారు. 17 వేల మందికి పైగా ఉద్యోగస్థులకు జీతాలు పెంచినందుకు ఓట్లు వేయబోతున్నారని భూమన పేర్కొన్నారు. 22 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించి నందుకు ఓట్లు వేయాలని అనుకుంటున్నారన్నారు. ఆరణి శ్రీనివాసులు నిన్న కర్నాటక నుంచి అక్రమంగా తెప్పిస్తున్న చీప్ లిక్కర్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిందని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com