నవరత్నాల సంక్షేమాన్ని పేదవాడికి పంచుతూ, వారి కనీస అవసరాలు తీర్చుతూ, వారికి విద్యను, ఆరోగ్యాన్ని, ఆర్థిక మెరుగుదలను, ఉపాధిని, భద్రతను, భవితను గత ఐదేళ్ల పరిపాలనలో సీఎం వైయస్ జగన్ చూపించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణమురళీ అన్నారు. అదే చంద్రబాబు దృష్టిలో పేదలంటే ఐదేళ్లకోసారి ఓట్లు అమ్ముకునే జీవశ్చవాలు లాంటివారని చెప్పారు. సంపద సృష్టిస్తాం అంటూ చంద్రబాబు చెబుతున్నాడే.. ఆయన ముఖ్యమంత్రి అయ్యినప్పటి నుంచీ దిగిన వరకు ప్రతీ బడ్జెట్లో రెవెన్యూ లోటు.. రెవెన్యూలోటు కనిపిస్తుందని, మరి, సంపద ఎక్కడ సృష్టించాడని ప్రశ్నించారు.