సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవాహం మొదలైంది. గతంలో పొరుగు నియోజకవర్గంలో ఓటమిపాలై ఇప్పుడు పర్చూరు నియోజకవర్గ బరిలో ఉన్న ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి, ప్రవాస భారతీయుడు పోస్టల్ బ్యాలెట్ లను 3500 రూపాయలు చొప్పున కొనుగోలు చేశారని సర్వత్రా వినవస్తోంది. గెలుపే పరమావధిగా పెట్టుకున్న ఆ నేత పక్షాన డబ్బు కట్టలని కుమ్మరించడానికి ఓ చీరాల 'గుర్రం' సకల ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.