ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఆగడాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 07:58 PM

చంద్రబాబు  ఎన్నిక‌ల్లో ఓడిపోతాడని తెలిసి మహిళల మీద దాడులు చేయిస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం  రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత మండిప‌డ్డారు.  హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమ‌న్నారు. బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ పై దాడికి ప్రయత్నం  అంటే టిడిపి బరితెగింపును అర్ధం చేసుకోవచ్చు. దళిత మహిళ తానేటి వనిత పై దాడి దళితులపట్ల టిడిపి,చంద్రబాబు వైఖరిని తెలియచేస్తోంది. మహిళలపై టీడీపీ ఆగడాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి విజయవాడలో కూడ బొండా ఉమా మహిళల మీద దాడులు చేయించారు.. మహిళలకు పెద్ద పీఠ వేసి రాజకీయంగా అనేక పదవులు,రాజకీయంగా మహిళలకు 50% రిజర్వేషన్ వైయ‌స్ఆర్‌ సీపీ ఇచ్చింద‌ని సునీత తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com