సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో ప్రపంచ స్థాయి విప్లవాన్ని తెచ్చారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. అది చూసి పెత్తందారుల ప్రతినిధులైన చంద్రబాబు అండ్ కో.. తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మీడియాతో మాట్లాడుతూ...... చంద్రబాబూ.. నువ్వు నారా లోకేశ్ను ఇంగ్లీషు మీడియంలో చదివించలేదా? పవన్ కల్యాణ్..1984లో నువ్వు నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూళ్లో చదువుకోలేదా? 40 ఏళ్ల క్రితం పవన్ కల్యాణ్ని ఆయన తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో చదివించారు. సరే ఆయనకు చదువు అబ్బలేదు..గాలికి తిరిగాడు..అది ఆయన వ్యక్తిగతం. 2024లో బడుగు బహీనవర్గాలు, దళితులు, బీసీలు, మైనార్టీలు వాళ్ల బిడ్డల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించుకోవాలని కోరుకోవడంలో తప్పేంటి? ఈనాడు రామోజీరావు కొడుకులు, మనవళ్లు, మనవరాళ్లు అందరూ ఇంగ్లీషు మీడియంలోనే చదువుకున్నారు కదా..! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.., నీ కుమారుడు, కుమార్తె ఇంగ్లీషు మీడియంలోనే చదువుకున్నారు కదా. ప్రపంచ స్థాయిలో ఉన్న అన్ని సదుపాయాలు మీ బిడ్డలకు, మనవళ్లకు, మనవరాళ్లకు అందించారే..పేద ప్రజలకు అందితే ఎందుకంత కంటగింపు? జగన్ గారు నాడు-నేడు ద్వారా గవర్నమెంటు బడుల రూపురేఖలు పూర్తిగా మార్చారు. 3వ తరగతి నుంచి టోఫల్, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ తో ప్రపంచస్థాయి మేటి విద్యను ఆంధ్రప్రదేశ్ లో పేద పిల్లలకు అందిస్తున్నారు. ఏపీలోని బడుగు బలహీనవర్గాల ఆత్మగౌరవాన్ని ఐక్యరాజ్యసమితిలో ఎగరేస్తే..మీకెందుకు అంత కడుపుమంట? అని ప్రశ్నించారు.