మీ ఇంట్లో, మీ గ్రామాలకు మంచి జరిగితేనే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని వైయస్ఆర్సీపీ నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ కోరారు. నందిగామ నియోజకవర్గంలోని నందిగామ మండలంలోని రాఘవపురం, పల్లగిరి, కమ్మవారిపాలెం గ్రామాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు వెళ్లిన ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వందలాదిగా తరలివచ్చి ప్రచారంలో మొండితోకపై పూల వర్షం కురిపించారు. మీ గ్రామాలకు మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి.. మా పాలనలో మార్పు కనపడితే మద్దతు ఇవ్వండి.. అంటూ డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రజలను ఓటు అభ్యర్థించారు .