ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కళాశాల ఫీజులు ఖరారయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా ఫీజులును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.
-గ్రామ పంచాయతీల పరిధిలో: ఎంపీసీ, బైపీసీలకు రూ.15000, ఇతర గ్రూపులకు రూ.12000.
-మున్సిపాలిటీల పరిధిలో: ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15000.
-కార్పొరేషన్ల పరిధి:ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000, ఇతర గ్రూపులకు రూ.18000 గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.