గుంటూరు: తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద భారత్ మాత విగ్రహాన్ని తొలిగించటాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించారు. భరతమాత విగ్రహాన్ని పున ప్రతిష్టించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేపీ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అభ్యంతరం తెలపడంతో బీజేపీ నాయకులు వినతిపత్రం ఇచ్చేందుకు మంగళగిరి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.