ఈ ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్న వాళ్లకే టిక్కెట్లు ఇచ్చారని వైయస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. డబ్బులతో గెలవ వచ్చని వాళ్లు భావిస్తున్నారన్నారు. ఓటుకు రూ.5 వేలు ఇచ్చి దాంతో గెలుస్తానని నారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోసం 1,200 మంది రౌడీలను, నారాయణ సిబ్బంది, విజయవాడ, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారన్నారు.