డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు చేసిన పని అతడి ప్రాణం తీసింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ యువకుడు (25) తన ప్రేయసితో శృంగారంలో పాల్గొన్నాడు. అప్పటికే డ్రగ్స్ మత్తులో ఉన్న ఆ యువకుడు గర్భం రాకుండా ఉండేందుకు ప్రైవేటు పార్ట్కు డ్రగ్స్ అంటించి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు. ఆ మరుసటి రోజు అతడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు వచ్చి చూసేసరికి అతడు మృతి చెందాడు. అయితే గర్భం రాకుండా ప్రైవేటు పార్ట్కు రాసుకున్న డ్రగ్తో అతడు మృతి చెందాడని పోస్టుమార్టంలో తేల్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలేం జరిగింది అనేదానిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.