కరోనా రోగులు తమ ఇళ్లల్లో వారే సొంతంగా ఆహారం వండుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు ప్రముఖ సెలెబ్రిటీ చెఫ్ సరన్ష్ గోయిలా. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్తో సరన్ష్ భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కరోనా రోగులు వాట్సాప్, ఫేస్బుక్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి ఫుడ్ ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు సరన్ష్. వారికి కావాల్సిన ఆహారాన్ని అందించడానికి covidmealsforindia.com వెబ్సైట్ను సైతం ఇదివరకే ప్రారంభించారు. ఈ ప్లాట్ఫామ్కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది వినియోగదారులు దీని ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే ప్లాట్ఫామ్ వాట్సాప్ ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.
ఇలా ఆర్డర్ చేసుకోండి..
1. మొదటగా మీ వాట్సాప్ నుంచి +91 8882891316 నంబర్ కు ‘హాయ్’ పంపండి. లేదా https://wa.me/918882891316 లింక్ పై క్లిక్ చేయండి.
2. సర్వీస్ ప్రొవైడర్ కోసం రిజిస్ట్రేషన్ లేదా ఫుడ్ ఆర్డర్ అనే రెండు ఆప్షన్లు మీకు పంపిస్తారు.
3. ఫుడ్ ఆర్డర్ కోసం 2 నంబర్ ను ఎంటర్ చేసి సెండ్ చేయండి.
4. అప్పుడు వాట్సాప్ బోట్ మీ పిన్కోడ్ అడుగుతుంది.
5. మీరు మీ ఏరియా పిన్కోడ్ను అందించిన తర్వాత, సమీపంలోని అన్ని సర్వీసు ప్రొవైడర్ల జాబితా మీకు ప్రత్యక్షమవుతుంది.
6. మీకు నచ్చిన సర్వీస్ ప్రొవైడర్ను ఎంచుకోండి. వెంటనే వారి అధికారిక వెబ్సైట్లోకి ప్రవేశం పొందుతారు.
7. వెబ్సైట్లో మీ సర్వీస్ ప్రొవైడర్ కాంటాక్ట్ డీటెయిల్స్ పొందవచ్చు. ఫుడ్ మెను, ఇతర ఆహారాల లభ్యత కోసం మీరు స్వయంగా సర్వీస్ ప్రొవైడర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఫుడ్ ఆర్డర్ చేసిన కొద్ది సేపటికే ఆరోగ్యకరమైన ఆహారం మీ ఇంటిముందు ఉంటుంది.