ఇంగ్లండ్ లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు స్టాండ్ బైగా ఎంపికైన కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (25) కరోనా బారినపడ్డాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రసిద్ధ్ కృష్ణ ప్రస్తుతం తన స్వస్థలం బెంగళూరులోనే హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.