ఆర్టికల్ 370 రద్దుపై లోక్సభలో రభస జరుగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్షా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్ ఎంపి ఆధిర్ రంజన్ మాట్లాడుతూ కాశ్మీర్ సమస్య ఐక్యరాజ్యసమితిలో ఉందని, అది అంతర్గత సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ రభస సృష్టించారు. కాంగ్రెస్ ఎంపి ఆధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతున్నప్పుడు బిజెపి ఎంపిలు గందరగోళం సృష్టించారు.