బెంగళూరు : ' నేను చదువుకున్న పాఠశాలలోనే ఓటేయడం సంతోషంగా ఉంది '' అని సినీ నటుడు-బెంగళూరు సెంట్రల్ స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. గురువారం ఉదయం బెంగళూరు సెంట్రల్ సెయింట్ జోసఫ్ పాఠశాలలో ప్రకాష్రాజ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా.. ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ... తాను చదువుకున్న పాఠశాలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రావడం కొత్త అనుభూతిలా అనిపించిందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఓటు హక్కు ఉన్న వారంతా ఓటు వేసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందని, ఇందుకు బహిరంగంగా కనిపిస్తున్న ' క్యూ ' లే నిదర్శనమని, ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ప్రకాష్రాజ్ వ్యాఖ్యానించారు.