బీజేపీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో జీవీఎల్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది చెప్పు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.