టీడీపీ,జనసేన, బీజేపీ,కాంగ్రెస్ అన్ని పార్టీలు వైయస్ జగన్ మీద కక్ష కట్టారని పోతుల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో టీడీపికి ప్రజలు బుద్ది చెప్పారు మళ్ళీ 2024 లో టిడిపి కూటమికి బుద్ది చెప్పబోతున్నారు. దళితులు అందరూ అవమానం పడేలా చంద్రబాబు చేస్తున్నాడు. దళితులు జగన్ కి అండగా ఉంటారు.. మహిళలకు వచ్చే ఆసరా,చేయూత పథకాలను రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు.అవ్వ తాత పెన్షన్స్ ఆలస్యం అయ్యేలా చంద్రబాబు చేసాడు.. అవ్వాతాతల ఉసురు చంద్రబాబు,పవన్ కల్యాణ్ లకు తగులుతుందని పోతుల సునీత హెచ్చరించారు.