అధికారంలో ఉన్నన్నాళ్లూ పేదల ఆర్థికపరిస్థితేంటి..? వారి కుటుంబాల జీవనప్రమాణాలేంటనేది చంద్రబాబుకు అవసరంలేని సంగతి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణమురళీ అన్నారు . అయన మాట్లాడుతూ.... ఆయనకు తెలిసిందల్లా ఐదేళ్లకోసారి ఎన్నికలనగానే పేదలు, కూలీల దగ్గరకు వచ్చి.. వారి ఓటుకు విలువ కట్టడమే. ఓటుకు రూ.వెయ్యి చొప్పున, ఇద్దరికి రూ.2 వేలు, ముగ్గురికి రూ.3వేలు చొప్పున కుటుంబాలకు పంచడమే తెలుసు. మరి, అప్పటిదాకా ఈ పేదవాడి పరిస్థితేంటి..? పూరిగుడిసె, నాగరికత లేదు. డబ్బుల్లేవు. అప్పులు. చుట్టూ పేదరికం, పిల్లలకు విద్యలేదు. తింటానికి తిండిలేదు. కట్టుకోవడానికి బట్ట లేదు. ఇలాంటి వాడికి చంద్రబాబులాంటోడు రూ.వెయ్యి నోటు చూపెట్టి.. ఇదిగో నాకు ఓటేస్తే, ఈ నోటు నీదేనంటూ ఆశపెట్టి.. దశాబ్దాలుగా ఓట్లకు నోట్ల రాజకీయం చేయడమే ఆయనకు తెలుసు అని తెలియజేసారు.