కర్ణాటక లోక్సభ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సీనియర్, బలమైన నేతలను కాదని బెంగళూరు దక్షిణ లోక్సభ టికెట్ను 28ఏళ్ల యువ న్యాయవాదికి కేటాయించి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ దివంగత నేత, కేంద్ర మాజీమంత్రి అనంత కుమార్ సతీమణి తేజస్విణీని బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఐతే ఆఖరి నిమిషంలో ఆమెను కాదని కర్ణాటక హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న తేజస్వీ సూర్యను తెరపైకి తీసుకువచ్చింది. సూర్యను బెంగళూరు దక్షిణ స్థానానికి తమ అభ్యర్థిగా బీజేపీ ఎన్నికల కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక స్థానానికి తనను అభ్యర్థిగా ఎంపిక చేయడంపై తేజస్వీ షాక్కు గురయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్పై తేజస్వీ పోటీపడనున్నారు. యువ నేతలకు అవకాశాలు ఇవ్వాలని, వారికి పార్టీలో సముచితస్థానం కల్పించాలని అభ్యర్థుల ఎంపికలో నిర్ణయించినట్లు ఒక బీజేపీ వర్గాలు తెలిపారు.