ఓటు అనే ప్రాథమిక హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పార ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ఒంగోలు అర్బన్ శివప్రసాద్ కాలనీలో గురువారం పార స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సరోజిని మహిళా పొదుపు సంఘం సభ్యులకు ఓటు హక్కు పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ రేపటి తరం బాగుకోసం ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు.