అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని గొల్లపల్లి రోడ్డులో సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ వంటకాలవ తూము విరగడంతో లారీ ఇరుక్కుపోయిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. లారీ రోడ్డుకు అడ్డంగా ఇరుక్కపోవడంతో గొల్లపల్లి గ్రామానికి వెళ్లే ప్రజలకు, రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.