కళ్యాణదుర్గం పట్టణం అమిలినేని క్యాంపు కార్యాలయంలో బసవేశ్వర జయంతి సందర్భంగా శుక్రవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు బసవేశ్వర స్వామి చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజ నిర్వహించారు. విరక్తి మఠం పీఠధిపతి కల్యాణస్వామి సురేంద్ర బాబును ఆశీర్వదించారు. వారు బసవేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విరక్తిమఠం కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.