నారా చంద్రబాబు నాయుడు నేడు ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం అద్దంకి బస్టాండ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి ఉత్తర బైపాస్ లోని బృందావనం కల్యాణ మండపంలో బస చేసి శనివారం ఉదయం వెళ్తారు. దీంతో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఒకరోజు ఉండటంతో చంద్రబాబు పర్యటన జిల్లాలో ఆసక్తికరంగా ఉంది.