ట్రాన్స్ ఫోర్ట్ రంగంలో ప్రతిభ కనబరిచిన ఏపీఎస్ ఆర్టీసీకి రెండు అవార్డులు వచ్చాయి. వాహన ఉత్పాదకత లో అత్యున్నత పనితీరు చూపినందుకు అవార్డు అత్యుత్తమ కె.ఎం.పి.ఎల్ సాధించినందుకు విశాఖపట్నం కు అవార్డు వచ్చింది. అసోసియేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ 63వ వార్షికోత్సవ వేడుకలు ఢిల్లీ లో జరిగాయి. న్యూఢీల్లీలోని గుల్మొహర్ హ్యాబిటెట్ వరల్డ్ నందు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అవార్డు అందుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ జాతీయ అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్మికులు, అధికారుల కష్ట ఫలంగా ఈ అవార్డులు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు ఏపీఎస్ ఆర్టీసీ మొత్తం 8 అవార్డులు అందుకుందని, భవిష్యత్తులోని మరిన్ని అవార్డులు ఏపీఎస్ ఆర్టీసీ అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.