ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావిద్ అన్వర్ పట్టణ పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో శుక్రవారం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పలు వార్డుల్లో ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుంటూ నేనున్నాననే భరోసా కల్పిస్తూ హస్తం గుర్తు పైన ఓటు వేసి మీ బిడ్డగా అత్యధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.