ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వార్తలను నమ్మోదు,,,, పీఐబీ ఇండియా

national |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 04:58 PM

ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ఆధార్ కార్డుతో రుణాలు అన్న ప్రచారాన్ని నమ్మోద్దని పీఐబీ ఇండియా ప్రజలను సూచించింది. ఇదిలావుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తుంటాయి. వాటిపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి పథకానికి ఆధార్ కార్డు అనేది తప్పని సరిగా అయింది. ఇదే క్రమంలో ఒక వార్త ప్రస్తుతం దేశమంతటా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండానే రూ.4.78 లక్షల రుణాలు అందిస్తోందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ లోన్ కావాలనుకునే వారు అందులోని లింక్‌ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిందా కోరుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఏజెన్సీ పీఐబీ ఇండియా.. తన ఫ్యాక్ట్ చెక్‌లో ఈ వార్త ఫెక్ అని తేల్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది. ట్విట్టర్ వేదికగా ఆధార్ కార్డు రుణాలపై వివరణ ఇచ్చింది.


జనవరి 15న సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ఫేక్ మెసేజ్ ఫోటోను షేర్ చేస్తూ తప్పుడు వార్త అని, అప్రమత్తంగా ఉండాలని కోరింది పీఐబీ ఇండియా. ఇలాంటి మెసేజ్ లను ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దని సూచించింది. అలాగే.. లింక్‌లపై క్లిక్ చేసి ఎవరూ తమ ఆర్థిక పరమైన, ఇతర వివరాలను షేర్ చేయొద్దని హెచ్చరించింది. 'పీఐబీ ఫాక్ట్ చెక్ ఈ మెసేజ్ ఫేక్. ఫోర్జరీ చేసేందుకు చేస్తున్న ప్రయత్నం. ఎవరితోనూ మీ వ్యక్తిగత, పైనాన్షియల్ వివరాలను షేర్ చేసుకోవద్దు. ' అని హెచ్చరికలు చేసింది పీఐబీ.


ఆధార్ కార్డ్ ఉన్న వారికి రుణాలు అనే మెసేజ్ గత ఏడాది ఆగస్టు నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేల్చింది పీఐబీ. ఇలాంటి తప్పుడు వార్తలను ఇతరులకు షేర్ చేయొద్దని, అలా చేస్తే చిక్కుల్లో పడతారని వార్నింగ్ ఇచ్చింది. ఆధార్ కార్డు ఉన్న వారికి రూ.4.78 లక్షల రుణాలు వంటి ఎలాంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని స్పష్టం చేసింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com