టీవీ యాంకర్గా తనదైన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్న జోర్దార్ సుజాత బిగ్బాస్లోకి వెళ్లిన తర్వాత మరింత ఎక్కువ మందికి చేరువైంది. బిగ్బాస్లో ఉన్న సమయంలో కారణం లేకుండా నవ్వుతూ ఆకట్టుకునేది. ప్రస్తుతం తన పేరుతోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇటీవల ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్లో పాల్గొని అలరించింది. ఈ క్రమంలో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్కు దగ్గరైంది. అతడితో ప్రేమలో పడ్డానంటూ ఓ షోలో చెప్పి అందరికీ షాకిచ్చింది. తాజాగా తన ప్రియుడికి ఆమె ఖరీదైన గిఫ్ట్ కొనిచ్చింది. రూ.లక్ష విలువైన ఫోన్ కొనిచ్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాకేష్ తనకు అత్యంత ఆత్మీయుడని, ఫ్రెండ్ కంటే ఎక్కువని సుజాత చెప్పింది. ఆయనకు కోపం వస్తే ఫోన్ పగులగొట్టే అలవాటు ఉందని పేర్కొంది. తనను సన్నిహితురాలిగా భావిస్తాడని, తానిచ్చే గిఫ్ట్ కావడంతో ఆ ఫోన్ను పగులగొట్టడని ధీమా వ్యక్తం చేసింది. అతడు తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తాను అత్యంత సంతోషంగా ఉన్నట్లు చెప్పింది. తాను సాధించిన ప్రతి విజయం వెనుక రాకేష్ ఉన్నట్లు వివరించింది. ఇక ఆమె రూ.లక్షా 20 వేల విలువైన శామ్సంగ్ లాక్సీ S 22 అల్ట్రా ఫోన్తో పాటు స్మార్ట్ వాచ్ ఇచ్చిందని, తనకు మాటలు రావడం లేదని రాకేష్ తెలిపాడు.