అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీతో అవగాహన కుదిరిందని పటేల్ రిజర్వేషన్ల పోరాట యోధుడు హార్ధిక్ పటిదార్ అనామత్ ఆందోళ్ న సమితి నాయకుడు అన్నారు. గుజరాత్ ఎన్నికలలో తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. టెకెట్ల కేటాయింపు విషయంలో పటేళ్లకు అన్యాయం జరిగిందంటూ నిన్నటి వరకూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగి….పటేల్ అనామత్ ఆందోళన్ సమితి తరఫున ఎవరూ నామినేషన్లు వేయవద్దని పిలుపునిచ్చని హార్ధిక్ పటేల్ ఈ రోజు కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిపిన చర్చలు ఫలవంతమవ్వడంతో ఆ పిలుపును ఉపసంహరించుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తామనీ, బీజేపీకి రాష్ట్రంలో గట్టి బుద్ధి చెబుతామని పేర్కొన్నారు.