ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాటు సారా మరియు చీప్ లిక్కర్ మీద ప్రతిపక్షాలు రోజు గొల్లు మని అసెంబ్లీ లో చర్చ జరగాలి అని వేసుకుంటున్నాయి. ఐతే తాజాగా సీఎం జగన్ చిత్రపటానికి జే బ్రాండ్ లిక్కర్ పోసి టిడిపి శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కల్తీ సారా, జే బ్రాండ్ లిక్కర్ కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అసెంబ్లీ లో చర్చ జరపాలి, బాధితుల కుటుంబాలకు న్యాయం చెయ్యాలి. కల్తీ సారా, జే బ్రాండ్ల మరణాలపై న్యాయ విచారణ కు అంగీకరించే వరకూ మా పోరాటం ఆగదు అని టీడీపీ నాయకులూ నారా లోకేష్ తెలియచేసారు.