వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులు రద్దీ ఇంకా కొనసాగుతొంది. రెండొవ శనివారం, అదివారంతో పాటు శ్రీకృష్ణాష్టమి, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాలుగురోజులు వరుస సెలవులుతో రావడంతో దక్షిణాది రాష్ట్రాల నుండి తిరుమల కొండకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అన్యుహ్యంగా పెరిగిన రద్దీతో శ్రీవారి దర్శనానికి 15 గంటలు సమయం పడుతొంది...రద్దీని దృష్టిలో పెట్టుకొని విఐపీ బ్రేక్ దర్శనాలను, 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోటాను టీటీడీ పరిమితం చేసినప్పటికీ సామన్యభక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు...వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు బారులు తీరున్నారు...ఓవైపు వాతవరణశాఖ నుండి వర్షసూచన ఉండడంతో వెలుపల క్యూలైన్ లలో భక్తుల ఎక్కువ సమయం వేచివుండకుండా కంపార్టమెంట్లలోకి పంపుతున్నారు..అలాగే అంతరాయం లేకుండా వేడి పాలు, అన్నప్రసాదాలను సిబ్బంది భక్తులకు పంపిణీ చేస్తున్నారు. రద్ధీ కారణంగా స్వామివారి దర్శనం ఆలస్యం అవుతున్నప్పటికీ , స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని, భక్తులు సౌకర్యాల దృష్ట్యా దేవస్థానం సిబ్బంది భేషుగ్గా ఏర్పాట్లను చేసిందని భక్తులు అంటున్నారు.