కాపులను బీసీల్లో చేర్చడం టీడీపీతోనే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేర్చడమే సీఎం చంద్రబాబు ప్రధాన ఆశయమని, చంద్రబాబు కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. స్వలాభం కోసం కొందరు కాపులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. కాపులకు మేలు చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేని చినరాజప్ప పేర్కొన్నారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు వద్దని, విద్య, ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు కావాలని సీఎంను కోరతామన్నారు. ఓ రాజకీయ పార్టీ చేతిలో ముద్రగడ కీలుబొమ్మ అని ఎద్దేవాచేశారు.