పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పాక్ రేంజర్లకు భారత ఆర్మీ అధికారులు స్వీట్లు ఇచ్చారు. అటు పాకిస్థాన్ రేంజర్లు కూడా భారత అధికారులకు స్వీట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. భారత్-పాక్ సరిహద్దు వాఘా-అట్టారి చెక్ పోస్ట్ వద్ద ప్రతి ఏటా ఇరు దేశాల అధికారులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.