అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి(69) కన్నుమూశారు. ఈ నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు. మూడో రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఆ తరువాత వైద్యుల సలహా మేరకు ఆయన విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరారు. రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. గతంలో ఆయన విశాఖ మేయర్ గా, అనకాపల్లి ఎంపీగా ఆయన పనిచేశారు.