భోపాల్ : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వాలియర్లో మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది అంగన్వాడీ వర్కర్లు మరణించారు. గ్వాలియర్లోని ఓల్డ్ కంటోన్మెంట్లో వేగంగా వస్తున్న రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొట్టాయి. ఆ మహిళలంతా అంగన్వాడీ వర్కర్లని, ఒక సమావేశం నిమిత్తం వె ళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మఅతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.