డిఆర్ఐ అధికారులు ఇద్దరు వ్యక్తుల నుంచి బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 4.9 కోట్ల రూపాయిలు ఉంటుంది. భువనేశ్వర్ డిఆర్ఐ అధికారులు విదేశాల నుంచి స్మగుల్ చేస్తున్న బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారని జిఎస్టి కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సమీర్ సర్కార్ చెప్పారు. 12.9 కిలోల బరువున్న బంగారు బిస్కట్ల విలువ 4.9 కోట్ల రూపాయిలని సమీర్ చెప్పారు. బిస్కట్లను తెస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సమీర్ అన్నారు.