స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రదాడులు జరుగవచ్చుననే అనుమానంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. విమానాశ్రయాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాలతో సహా సున్నిత ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.