పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రీనిత్ కౌర్ బ్యాంకు ఖాతాలో నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 23 లక్షలను మాయం చేశారు. కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్న ప్రీనిత్ కౌర్కు కొద్ది రోజుల క్రితం.. తాను బ్యాంకు మేనేజర్ను అని చెప్పి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఖాతాలో జీతం డబ్బులు జమ చేయాలని.. ఖాతా వివరాలు ఇవ్వాలని ఆమెను సదరు వ్యక్తి కోరాడు. దీంతో ఆమె బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఏటీఎం నెంబర్, పిన్ నంబర్, సీవీసీ నంబర్, ఓటీపీలను అతనికి చెప్పింది. కాసేపటి తర్వాత ఆమె ఖాతాలో నుంచి రూ. 23 లక్షలు డెబిట్ అయినట్లు తన మొబైల్కు ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో బాధిత ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సైబర్ నేరగాళ్లు మోసం చేశారని తేలింది. ప్రీనిత్ కౌర్కు ఫోన్ చేసిన నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి కేసును చేధించారు. జార్ఖండ్ నుంచి ఆ సైబర్ నేరగాడు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.