ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఐదుగురు నక్సలైట్లు హతమయ్యారు. చత్తీస్గఢ్ జిల్లాలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, నక్సల్స్కు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కోసం భద్రతా బలగాలు వెళ్లినప్పుడు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వివరించారు.ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.