ఇస్లామాబాద్ : భారత దేశంలో అధికార పార్టీది ముస్లిం వ్యతిరేక వైఖరి అని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. వాషింగ్టన్ పోస్టకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో అధికారంలో ఉన్న పార్టీ ముస్లిం వ్యతిరేక, పాకిస్థాన్ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని అన్నారు.అందుకే తాను స్నేహహస్తం అందించినా భారత్ సానుకూలంగా స్పందించడం లేదన్నారు.